Crime: దారుణం రూ.300 ల కోసం ఏకంగా దారుణానికి ఒడిగట్టిన వ్యక్తులు.. ఏం చేశారంటే?

Crime: సాధారణంగా మందుబాబులు తాగితే ఎంత బీభత్సం సృష్టిస్తారో మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు మందుబాబులు ఆ మత్తులో ఏం చేస్తున్నామో తెలియకుండా ఎదుటివారిపై దాడులకు దిగుతూ ఉంటారు. కొందరు అయితే ఆ మద్యం మత్తులో చంపడానికి కూడా సిద్ధ పడుతూ ఉంటారు. ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో కేవలం 300 రూపాయల కోసం ఒక వ్యక్తిని దారుణంగా చంపిన హత్య చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన గతనెల 25న శంకర్ పల్లి లోని వడ్డెర స్మశానవాటికలో జరిగింది.

అయితే బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకొని తాజాగా రిమాండ్ కు తరలించారు. స్థానిక శంకర్పల్లి సిఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాల మేరకు.. కరీంనగర్ జిల్లా మెట్పల్లి కి చెందిన సాయిలు, మల్లేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు ప్రాంతాలలో పని చేసుకుంటూ ఉన్నారు. అయితే గత నెల 25వ తేదీన చిక్కడపల్లి లో నివాసం ఉండే మల్లేష్ వద్దకు సాయిలు వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఇక నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం చెరుకు పల్లికి చెందిన చెన్నయ్య అనే ఒక వ్యక్తి వారిద్దరితో ఏదో సమాచారం గురించి మాట్లాడాడు. ఇక వారు తాగిన మైకంలో అతన్ని అనవసరంగా కొట్టారు.

అప్పుడు చెన్నయ్య జేబులో నుంచి 300 రూపాయలు అలాగే ఫోన్ కింద పడిపోయాయి. వాటిని సాయిలు, మల్లేష్ చూసారు. అప్పుడు చెన్నయ్య వాటిని తీసుకొని కొద్దిదూరం వెళ్లగా అతన్ని ఫాలో అయిన మల్లేష్,సాయిలు అతన్ని బలవంతంగా దగ్గరలో ఉన్న స్మశాన వాటిక లోకి తీసుకెళ్లి బండరాయితో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే విడిచిపెట్టి అతని దగ్గర ఉన్న 300 ఫోన్ తీసుకొని పరారయ్యారు.దగ్గర్లో ఉన్న సీసీటీవీలో ఆధారంగా నిందితులను పట్టుకున్నారు పోలీసులు.