మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రికి క‌రోనా పాజిటివ్..!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. ఒక‌వైపు సామాన్యుల నుండి మ‌రోవైపు సెలబ్ర‌టీలు వ‌ర‌కు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇక ప్ర‌జాప్ర‌తినిధులు అయితే ప్ర‌తిరోజు ఎవ‌రో ఒక‌రు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇక తాజా మ్యాట‌ర్ ఏంటంటే మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ య్యింది. దీంతో ఆయ‌న హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. మ‌రోవైపు క‌డియం శ్రీహ‌రి డ్రైవ‌ర్, పీఏ, గ‌న్‌మెన్‌కు కూడా క‌రోనా సోకింద‌ని అధికారులు వెల్ల‌డించారు. దీంతో వారిని కోవిడ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇక గతకొన్ని రోజులుగా తెలంగాణ‌లో పలువురు ఎమ్మెల్యేలకు క‌రోనా సోకింది. అలాగే హోం మంత్రికి కూడా కరోనా సోకిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్రజాప్రతినిధులు, నాయకులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.