Rajendra prasad: కరోనా బారిన పడ్డ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. ఆస్పత్రిలో చికిత్స!

Rajendra prasad: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎంతోమంది ఈ మహమ్మారి బారినపడి ఈ మహమ్మారితో పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో కరోనా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ మహమ్మారి బారిన పడినట్టు తెలుస్తోంది.

తాజాగా నటుడు రాజేంద్రప్రసాద్ కరోనా చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన కుటుంబానికి ఫోన్ చేసి ధైర్యం కోల్పోకుండా ఉండాలని రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.

అయితే రాజేంద్రప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తెలియడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ నటించిన సేనాపతి అనే సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సినిమాతో ఆయన మొదటి సారి ఓటీటీలోకి అడుగుపెట్టారు. అదే విధంగా పలు సినిమాలలో తండ్రి పాత్రలో నటిస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.