Crime News: స్నేహితురాలి పై కానిస్టేబుల్ ఆత్యాచారం.. పెళ్లికి చేసుకోమని కోరగా..!

Crime News: చట్టం ముందు అందరూ సమానులే అని అంటుంటారు. కానీ చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టవిరుద్ధమైన పనులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒక కానిస్టేబుల్ యువతిపై అత్యాచారం చేసి పెళ్లి చేసుకోమని కోరగా నిరాకరించాడు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే.. కానిస్టేబుల్ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన హనుమకొండ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌ గా పని చేస్తున్న వ్యక్తి చిన్ననాటి నుండి కలిసి తన స్నేహితురాలితో ఎంతో చనువుగా ఉండేవాడు. యువతిని ప్రేమ పేరుతో సదరు కానిస్టేబుల్ మోసం చేశాడు. ఈ క్రమంలో ఒకరోజు బాధిత యువతినీ హనుమకొండ నయీంనగర్‌లోని గదికి పిలిచి యువతిని పెళ్లి చేసుకుంటానంటూ చెప్పి ఆమెను లోవరచుకొని అత్యాచారం చేశాడు. ఇలా మాయమాటలు చెప్తూ పలుమార్లు యువతి మీద అత్యాచారం చేశాడు.

ఇటీవల యువతి సదరు కానిస్టేబుల్ నీ పెళ్లి చేసుకుందామని కోరగా దాటవేస్తూ వస్తున్నాడు. యువతి పెళ్లి గురించి బాగా ఒత్తిడి చేయటంతో చివరకు తమ వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని పెళ్లి చేసుకోలేనని చెప్పాడు. ఈ క్రమంలో బాధిత యువతి తనకు జరిగిన అన్యాయం గురించి గురువారం హనుమకొండ ఠాణా పోలీసులకు బాధిత ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సదరు కానిస్టేబుల్‌ ములుగు జిల్లాలో పనిచేస్తున్నట్లుగా తెలిసింది.