మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్రలో కీలక విషయాలు వెల్లడి!

stephen ravindra

తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్రను ప్లాన్ చేసిన వ్యక్తిని సైబరాబాద్‌ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనపై సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పూర్తి వివరాలు వెల్లడించారు. యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌తో పాటు రాఘవేందర్‌ రాజు సహా మరికొందురు హత్యకు కుట్ర చేశారని సీపీ తెలిపారు. మంత్రిని హత్య చేస్తే రూ.15 కోట్లు ఇస్తామని ఫారూఖ్‌తో కాంటాక్ట్‌ అయినట్లు వివరించారు. రాఘవేందర్‌రాజు, మధుసూధన్‌రాజు ప్రధాన ఫైనాన్షియర్లు ఉన్నారని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు