రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ చేయనున్న సీఎం కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ చేయనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఇక ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ పరిణామాల గురించి, పాలనా పరమైన అంశాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా రాష్ట్రపతి ఎన్నికలపై కూడా చర్చలు చేయనున్నట్లు తెలిసింది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నేతలతో సమావేశం చేయనున్నారు కేసీఆర్. ఇక దీనిని బట్టి చూస్తే రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అనేది.. మద్దతు విషయంలో ఎలా వ్యవహరిస్తారు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది.