ఢిల్లీలో సీఎం జగన్.. ప్రధాని మోదీని కలిసేది అప్పుడే

Cm jagan to meet pm modi at 10.30 am on October 6th

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ చేరుకున్నారు. కడప నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న జగన్.. అక్కడి నుంచి డైరెక్ట్ గా ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ రాత్రి జన్ పథ్ 1 లోని తన నివాసంలో జగన్ బస చేయనున్నారు.

Cm jagan to meet pm modi at 10.30 am on October 6th
Cm jagan to meet pm modi at 10.30 am on October 6th

అనంతరం మంగళవారం(అక్టోబర్ 6)న ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్.. ప్రధాని మోదీని కలుస్తారు. ప్రధాని మోదీతో సీఎం జగన్.. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన హామీలు, ఇతర బకాయిలు, తెలంగాణతో నీటి పంపకాలు, రాయలసీమ లిఫ్ట్, మూడు రాజధానుల అంశంపై ప్రధానితో జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అలాగే.. మంగళవారం నుంచి నదీ జలాల పంపకాల అంశంపై జరిగే అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు.