హ‌మ్మ‌య్య‌.. అనుష్క మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది..!

టాలీవుడ్ గ్లామ‌ర్ బ్యూటీ అనుష్క శెట్టి టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మొద‌ట్లో గ్లామ‌ర్ పాత్ర‌లు పోషించిన ఈ అమ్మ‌డు త‌ర్వాత త‌ర్వాత మ‌హిళా ప్రాధాన్య‌త చిత్రాలు చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ పోతుంది. సూప‌ర్ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క అరుంధ‌తి చిత్రంతో ఆక‌ట్టుకుంది. ఇందులో జేజ‌మ్మ‌గా అనుష్క అభిన‌యం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమాతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఈ సినిమా త‌ర్వాత అనుష్క ఎక్కువ‌గా మ‌హిళా ప్రాధాన్య‌త ఉన్న చిత్రాల‌నే చేసింది.

అరుంధ‌తి చిత్రం త‌ర్వాత అనుష్క సైజ్ జీరో అనే సినిమా చేసింది. ఈ సినిమా కోసం భారీ కాయం పెంచిన అనుష్క ఆ త‌ర్వాత బాహుబ‌లి అనే ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో న‌టించింది. దేవ‌సేనగా అనుష్క న‌ట‌న ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని ఇచ్చింది. ఒక‌వైపు క‌థానాయిక‌గా న‌టిస్తూనే మ‌రోవైపు లీడ్ రోల్‌లో కొన్ని ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాలు చేస్తూ అల‌రిస్తుంది. బాహుబ‌లి త‌ర్వాత అనుష్క భాగ‌మ‌తి అనే చిత్రం చేసింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక రీసెంట్‌గా నిశ్శ‌బ్ధం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది.

నిశ్శ‌బ్ధం చిత్రంలో అనుష్క మూగ‌మ్మాయిగా కనిపించి అల‌రించింది అనుష్క‌. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఆమధ్య ఓటీటీలో విడుదలైంది. డిజిటల్ ప్రీమియర్ గా అక్టోబర్ 2 న విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క తాజాగా మ‌రో సినిమాకు సైన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి కీ రోల్ చేయనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనే దానిపై క్లారిటీ లేదు.