ఆయనకి ఫోన్ చేసి ఎమోషనల్ అయిపోయిన జగన్ మోహన్ రెడ్డి..!

ap cm ys jagan calls to china jeeyar swamy

చిన జీయర్ స్వామి తల్లి అలివేలు మంగతాయారు శనివారం పరమపదించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చిన జీయర్ స్వామికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేశారు. చినజీయర్ స్వామిని జగన్ ఫోన్ లో పరామర్శించారు. ఆయన తల్లి మృతి చెందడం పట్ల జగన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. చిన జీయర్ స్వామి త్వరగా ఆ బాధ నుంచి కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు.

ap cm ys jagan calls to china jeeyar swamy
ap cm ys jagan calls to china jeeyar swamy

చిన జీయర్ స్వామి తల్లి మంగతాయారు వయసు 85 ఏళ్లు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు కన్నుమశారు.

Chinna jeeyar swamy mother alivelu manga thayaru died
Chinna jeeyar swamy mother alivelu manga thayaru died

తన తల్లి అంత్యక్రియలను చిన జీయర్ స్వామి.. శంషాబాద్ కు సమీపంలో ముచ్చింతల్ లో ఉన్న చినజీయర్ ఆశ్రమంలో నిర్వహించారు.  

Chinna jeeyar swamy mother alivelu manga thayaru died
Chinna jeeyar swamy mother alivelu manga thayaru died

చిన్న జీయర్ స్వామికి తన తల్లి అంటే ఎంతో ప్రాణం. తన తల్లి మరణవార్తను జీయర్ స్వామి జీర్ణించుకోలేకపోయారు. సీఎం జగన్ ఫోన్ చేసినప్పుడు కూడా జీయర్ స్వామి భావోద్వేగానికి గురవడంతో జగన్ కూడా ఎమోషనల్ అయ్యారు. త్వరగా ఆ బాధ నుంచి తేరుకోవాలని జీయర్ స్వామికి జగన్ సూచించారు.