Crime News: పానీపూరి కావాలని అడిగిన పిల్లలు.. పానీపూరి తినిపించి దారుణానికి పాల్పడిన తండ్రి!

Crime News:శివరాత్రి పండుగ సందర్భంగా కోటప్ప కొండ తిరణాల అని చెప్పి బిడ్డలిద్దరిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లిన ఆ తండ్రి తన బిడ్డల పట్ల దారుణానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే తన ఇద్దరు పిల్లలతో కలిసి సాగర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.ఇలా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా తండ్రి శవం మాత్రమే లభించగా పిల్లల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోలీసులకు తెలిపిన వివరాల మేరకు..

బల్లికురవ మండలంలోని గుంటుపల్లి గ్రామానికి చెందిన గుర్రం చిరంజీవికి కళ్యాణి అనే అమ్మాయితో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 10 సంవత్సరాల కుమారుడు 8 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. ఇక పిల్లలు తమ తండ్రిని పానీపూరి తినిపించాలని అడిగారు.పిల్లలు అడగడంతో ఆ తండ్రి ఇద్దరు పిల్లలను ద్విచక్ర వాహనం పై తీసుకెళ్లి పానీపూరి తినిపించారు. అలాగే పానీ పూరి తినిపించిన తర్వాత తన భార్యకు ఫోన్ చేసి కోటప్ప కొండ తిరణాలకు వెళ్తున్నామని చెప్పి వెళ్లారు.

బుధవారం ఉదయం అయిన భర్త పిల్లలు ఇంటికి రాకపోవడంతో కల్యాణి సమీప బంధువుల ఇంటికి ఫోన్ చేసి ఆరా తీసింది. అయితే కొండ సమీపంలో సాగర్ కాలువ వద్ద చిరంజీవి ద్విచక్ర వాహనం చెప్పులు ఉన్నాయని చెప్పడంతో వెంటనే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్లు సహాయంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. చిరంజీవి మృతదేహం లభించగా పిల్లల ఆచూకీ లభించలేదని పోలీసులు వెల్లడించారు అయితే గ్రామస్తులు చెప్పిన సమాచారం ప్రకారం చిరంజీవి ఇప్పటికే 20 లక్షల వరకు అప్పు చేశారని, అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.