బోణి కొట్టిన చెన్నై .. ఛేదనలో RCB బోల్తా

ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి బోణి కొట్టింది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బెంగళూరు టీమ్ తడబడింది. చివరికి ఆ టీం 193/9కే పరిమితమైంది.