నాగచైతన్య, సమంత.. ఈ డ్రామా ఎందుకు చెప్మా.?

అక్కినేని నాగచైతన్య.. సమంత.. ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తమ ఇద్దరి మధ్యా ప్రేమానుబంధాల గురించి ఇరువురూ పలు సందర్భాల్లో చాలా చాలా గొప్పగా చెప్పుకున్నారు. చాలా మ్యాజికల్ మూమెంట్స్‌ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కూడా.
కానీ, ఏమయ్యిందో.. వున్నపళంగా ఈ ఇద్దరి మధ్యా గ్యాప్ పెరిగిందనే ప్రచారం షురూ అయినా.. ఇద్దరూ ఆ గాసిప్స్ విషయంలో స్పందించడంలేదు. సమంత తన పేరులోని ‘అక్కినేని’ని మాయం చేసింది. నిజానికి, ‘సమంత’ అనే పేరు కూడా మాయం చేసింది. జస్ట్ ‘ఎస్’ అని మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తోంది ఆమె అకౌంట్లకు సంబంధించి.

ఇద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారనీ, త్వరలోనే విడాకులు మంజూరు కానున్నాయనీ, మనస్పర్ధల కారణంగా పరస్పర అంగీకారంతో విడిపోతున్నారనీ, ప్రస్తుతానికి ఇద్దరూ విడివిడిగానే వుంటున్నారనీ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోపక్క, వీరిద్దరూ విడిపోయే క్రమంలో 250 కోట్ల మేర పంపకాలు జరుగుతున్నాయనీ, సమంతకే ఆ మొత్తం దక్కుతోందని కూడా స్పెక్యులేషన్స్ మీడియాలో వినిపించాయి. సాధారణంగా ఇలాంటి విషయాలకు తనదైన స్టయిల్లో సమాధానమిచ్చే సమంత, ఈసారి లైట్ తీసుకుంది. అక్కినేని నాగచైతన్య కూడా పెదవి విప్పడంలేదు.

తన తాజా సినిమా ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్ల కోసం అక్కినేని నాగచైతన్య మీడియా ముందుకొచ్చే అవకాశముంది.. అప్పుడేమైనా స్పష్టత ఇస్తాడా.? అన్నదీ ఆసక్తికరంగా మారింది. కాగా, ‘లవ్ స్టోరీ’ సినిమా ట్రైలర్ నాగచైతన్య సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదలైతే, దాన్ని రీట్వీట్ చేసిన సమంత, అందులో తన భర్త నాగచైతన్య పేరుని ప్రస్తావించకపోవడంపై రకరకాల వెటకారాలు షురూ అయ్యాయి. అయితే, కాస్త లేటుగా అయినా, సమంతకి ‘థ్యాంక్స్’ చెప్పాడు నాగచైతన్య, ‘లవ్ స్టోరీ’ ట్రైలర్‌కి సంబంధించి తన ట్వీట్‌పై స్పందించినందుకు.