అసెంబ్లీలో జగన్ కు చెక్ పెట్టనున్న చంద్రబాబు, ఈ విషయం తెలియక రెచ్చిపోతున్న జగన్

YS Jagan should repair CBN's damages to education system 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీలో జరుగుతున్న అవమానాలు గురించి అందరికి తెలిసిందే. రాజకీయాల్లో 30 ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు వైసీపీలోని కుర్ర నేతలు కూడా అవమానపరుస్తున్నారు. ఆ అవమానాన్ని చంద్రబాబు నాయుడు భరించలేకపోతున్నారు. ఈ కక్ష్యపూరిత రాజకీయాలను స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే విధానాన్ని పాటిస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు చేస్తున్న అవమానాలు నుండి బయటపడటానికి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు పతకం రచిస్తున్నారు.

EX TDP leaders feeling sad about their situation
EX TDP leaders feeling sad about their situation

అసెంబ్లీలో జగన్ కు చెక్ పెట్టనున్న చంద్రబాబు నాయుడు

ఏపీ అసెంబ్లీలో నాయకులు ప్రజా సమస్యల గురించి మాట్లాకుండా ఒకరిని ఒకరు తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలోని తప్పులను చంద్రబాబు చెప్తుంటే వైసీపీ నాయకులు మాత్రం బాబును అవమానిస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా జగన్ ఇలానే అవమానించారు. చంద్రబాబు నాయుడు చేసిన అవమానాలు వల్లే జగన్ కు ప్రజల్లో సింపథి వచ్చింది. ఇప్పుడు బాబుకు ఆ సింపథి కోసం అసెంబ్లీలో పతకం రచిస్తున్నారు. ప్రజల నుండి సింపథి కోరుకుంటున్నా చంద్రబాబు ఒక పెద్ద కారణం చూపించి అసెంబ్లీకి ఒక పెద్ద నమస్కారం చేసి, జగన్ సీఎం ఉండగా అసెంబ్లీకి రానూ అంటూ భీషణ ప్రతిన చేసి ప్రజల నుండి సింపథి పొందటానికి పతకం రచిస్తున్నారని సమాచారం. ఈ అవకాశం కోసమే బాబు వెయిట్ చేస్తున్నారని కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

జగన్ జాగ్రత్త పడకపోతే కష్టమే

2019 ఎన్నికల్లో జగన్ కు కలిసొచ్చిన అంశంలో సింపథి కూడా ఒకటి. వైసీపీ నాయకులను, జగన్ టీడీపీ నేతలు ఇష్టమొచ్చిన్నట్టు అవమానించారు. అవమానాల నుండే జగన్ కు ప్రజల నుండి సింపథి వచ్చి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు బాబు కూడా అదే పతకం రచిస్తున్నారు. ఈ విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెల్సుకోకపోతే రానున్న రోజుల్లో వైసీపీకి కూడా టీడీపీకి పట్టిన గతే పడుతుంది. ఈ రాజకీయ నాయకులు ఈ కక్ష్యపూరిత రాజకీయాలు చెయ్యడంలో ఉన్న శ్రద్ద ప్రజా సేవ చెయ్యడంలో ఉండదు.