అయ్యన్నపాత్రుడి ఇంటిపై జగన్ ఇంటి దాడులు చేశారు: చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడి ఇంటి గోడను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా చంద్రబాబు కూడా జగన్ పై విమర్శలు చేశారు.

అయ్యన్న పాత్రుడి ఇంటి పై జగన్మోహన్ రెడ్డి చీకటి దాడులు చేశారు అంటూ.. ఆయన ఇంటి గోడను అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష అని అన్నారు. తెలుగు దేశంలో బలమైన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని, అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు జగన్ పాల్పడుతున్నారు అని అన్నారు.