ఇంత అనుభవం పెట్టుకొని చంద్రబాబు ఇలాంటి తప్పు చేశాడేంటి?? టీడీపీ నాయకులే తల పట్టుకున్నారు

cbn and cm jagan

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అందరికి తెలుసు. దాదాపు పతనావస్థకు చేరువలో ఉంది. ఇంకొన్నాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగు అయ్యే అవకాశం ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు మరో తప్పు చేశారు. ఈ తప్పుతో టీడీపీకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తనకు రాజకీయాల్లో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని బాబు చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు బాబు చేసిన తప్పును కూడా చూసిన వాళ్ళను టీడీపీ రానున్న రోజుల్లో కనుమరుగు అవ్వడం ఖాయమని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.

cbn
cbn

బాబు చేసిన తప్పు ఏంటంటే…

చంద్రబాబు గత కొద్దిరోజులుగా హిందుత్వ అజెండాను ఎత్తుకున్నారు. రామతీర్థం కు స్వయంగా వెళ్లి హడావిడి చేశారు. అంతటితో ఊరుకోలేదు. ముఖ్యమంత్రి జగన్, హోం మంత్రి, డీజీపీ ముగ్గూరు క్రిస్టియన్లేనంటూ విమర్శలు చేశారు. వారివల్లనే ఏపీలో ఆలయాలపై వరస దాడులు జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా జరిగిన ఘటనలపై తమకు నిష్పక్ష పాతంగా విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని కూడా చంద్రబాబు తెలిపారు. అయితే చంద్రబాబు మాత్రమే కాదు… ఆయన పార్టీ నేతలందరూ ఇటువంటి ప్రకటనలే చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని ముస్లిం, క్రిస్టియన్ వర్గాలు చంద్రబాబుకు దూరమయినట్లేనంటున్నారు.

టీడీపీకి జగన్ చెక్ పెట్టారా!!

నిజానికి దళిత, మైనారిటీ వర్గాలు జగన్ కు పెట్టని కోటలుగా ఉన్నాయి. కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలతో ఆ రెండు వర్గాలు జగన్ కు దూరమయ్యారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ చంద్రబాబు తీసుకున్న అనూహ్య నిర్ణయం వైసీపీకి వరంగా మారింది. మళ్లీ ఆ రెండు వర్గాలు వైసీపీకి దగ్గరయ్యాయి. చంద్రబాబు కేవలం హిందూ ఓటు బ్యాంకు మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. హిందువులు గంపగుత్తగా ఒకరికే వేసే సీన్ లేదు. దీంతో చంద్రబాబు వేసిన లెక్క తప్పిందని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు బీజేపీ ట్రాప్ లో పడిపోయారని, ఆ పార్టీకి దగ్గరవ్వాలన్న యత్నంలో రెండు వర్గాలను తనకు తానుగానే దూరం చేసుకున్నారంటున్నారు