ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేదని ప్రకటించిన చంద్రబాబు నాయుడు..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ కి జరుగుతున్న ఉప ఎన్నికలలో టీడీపీ పోటీలో లేదని తెలిపారు. పదవిలో ఉన్న నేత మరణించడం వల్ల మృతుడి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని తెలిపారు.

ఇక ఈ సాంప్రదాయం గౌరవించి దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణం నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేయరాదని నిర్ణయించుకున్నాము అని అన్నారు. టీడీపీ పార్టీ బద్వేలులో ఎందుకు పోటీచెయ్యలేదో అదే కారణంతో ఆత్మకూరులో పోటీ చేయడం లేదని తెలిపారు. ఉప ఎన్నికలపై వైసీపీ సవాళ్లు నీచంగా ఉన్నాయని అన్నారు.