రాష్ట్ర అవతరణ వేడుకలలో మునిగిన తెలంగాణ..

ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఎంతో మంది ప్రజలు, విద్యార్థులు తెలంగాణ కోసం పోరాటం చేసి అమరులయ్యారు. మొత్తానికి తెలంగాణను సొంతం చేసుకున్నారు. ఇక ఈరోజు ఈ వేడుకను తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు.

ఇక గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు నివాళులు అర్పించారు. ఇక గ్రామాలలో జెండాను ఎగుర వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా పలు జిల్లాల్లో నిర్వహించిన వేడుకల ఫోటోలు బాగా వైరల్ గా మారాయి. పలు చోట్ల ర్యాలీలు కూడా నిర్వహించారు.