తిరుపతిలో ఎన్నికల్లో జగన్ షాక్ ఇవ్వనున్న బాబు, ఆనందంలో బీజేపీ నేతలు

cbn

2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఘోర పరాజయం పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వైసీపీని ఎలాగైనా దెబ్బకొట్టాలని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి వైసీపీపై చంద్రబాబు నాయుడు విరుచుకుపడుతున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలో చంద్రబాబు నాయుడు, టీడీపీ యొక్క లక్ష్యం తాము గెలవడం కాదు వైసీపీ ఓడించిడమని ప్రజలకు చాలా స్పష్టంగా అర్ధమవుతుంది.

cbn
cbn

సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలు

తిరుపతిలో జరిగే ఎన్నికలను సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకు సంకేతంగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారో లేదో తెలియదు కానీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మాత్రం భావిస్తున్నాయి. మొన్ననే దుబ్బాకలో జరిగిన ఎన్నికలను ఎలాగైతే టీఆర్ఎస్ యొక్క పాలనకు సంకేతంగా చేశారో ఇప్పుడు ఈ ఎన్నికను కూడా వైసీపీకి అంటకడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న వైసీపీకి బాబు షాక్ ఇవ్వనున్నారు. ఎలాగంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుపతిలో టీడీపీ గెలిచే అవకాశమే లేదు కాబట్టి టీడీపీ తరపున డమ్మీ నామినేషన్ వేయించి, బీజేపీకి పూర్తి మద్దతు ఇవ్వడానికి ఈ చీకటి రాజకీయ పొత్తుకు బాబు వ్యూహం రచించారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దుబ్బాక ఎన్నికల ఫలితాలతో ఇప్పుడు బీజేపీ నేతలు ఏపీలో తమ బలం నిరూపించుకోవాలని చాలా ఉత్సహంతో ఉన్న నేపథ్యంలో బాబు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

టీడీపీ రోజురోజుకు దిగజారుతుందా!!

గతంలో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ చేసిన రాజకీయాలను, చంద్రబాబు నాయుడు చేసిన రాజకీయాలను, ఎక్కిన శిఖరాలను తెలుగు ప్రజలు ఎప్పటికి మర్చిపోరు కానీ 2019 ఎన్నికల తరువాత మాత్రం టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఎంతలా అంటే తమ గెలుపుకోసం ప్రయత్నించకుండా కేవలం ప్రత్యర్థిని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో బాబు చేస్తున్న రాజకీయాలను చూస్తే టీడీపీ దిగజారుతున్న పరిస్థితి ఎవరికైనా అర్ధం అవుతుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎంతో చిత్తుగా ఓడిపోయిన లక్ష్మిని మళ్ళీ నిలబెడుతూ పార్టీని రోజు రోజుకు పతనావస్థకు చేరువ చేస్తున్నారు.