Mahesh Babu: ఆ సెంటిమెంట్ ను మహేష్ బాబు బ్రేక్ చేయగలడా… అభిమానులను కలవర పెడుతున్న సెంటిమెంట్!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం అప్డేట్ త్వరలోనే ఇవ్వనున్నారు.ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టు ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలోనే 9వ తేదీ 11వ తేదీ మరో రెండు అప్డేట్లను విడుదల చేసిన 14వ తేదీ ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.

అయితే ఈ సినిమాలో మొదటి పాట కళావతి పేరుతో ఉండబోతుందని చిత్రం విడుదల చేసిన పోస్టర్ ద్వారా తెలుస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ కళావతి పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 14వ తేదీ కళావతి పేరుతో ఈ పాట విడుదల కాబోతుందని తెలియడంతో అభిమానులు కాస్త కలవరపడుతున్నారు.మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆగడు చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఇందులో తమన్నా సరోజ పాత్రలో నటించింది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి కూడా హీరోయిన్ పాత్ర పేరుతో ఆజా సరోజా అనే పాటను విడుదల చేశారు.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలబడింది.ఈ క్రమంలోనే సర్కారు వారి పాట విషయంలో కూడా కళావతి పేరుతో పాట విడుదల కాబోతుందని తెలియడంతో అభిమానులు కాస్త కలవరపడుతున్నారు.అయితే ఈసారి సినిమా తప్పకుండా ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందని తమన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాని కూడా మేలో విడుదల చేయడంతో అభిమానులు ఈ సినిమా ఈ విషయంలో లో కాస్త కంగారుగానే ఉన్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు నటించిన పలు సినిమాలు మేలో విడుదల అయ్యాయి అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి.అయితే మహర్షి సినిమా ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి సర్కారు వారి పాట చిత్రాన్ని కూడా మే 12వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి నిజంగానే సర్కారీ వారి పాట సినిమా ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.