Crime News: కేరళలో కలకలం రేపుతున్న మహిళ వ్యాపారవేత్త దారుణ హత్య..!

Crime News: పాత కక్షలు, ఆస్తి గొడవలు, మనస్పర్థల కారణంగా చాలా మంది హత్యలు చేయటానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా కేరళలో మహిళ దారుణ ఘటన చర్చనీయాంశంగా మారింది. మార్చి 17, గురువారం రాత్రి త్రిసూర్‌లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…మన్నారా పరంబు గ్రామానికి చెందిన రిన్సీ నాజర్ అనే మహిళ బట్టల షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 17వ తేదీ రాత్రి ఆమె తన పిల్లలతో స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమె దుకాణంలో గతంలో పనిచేసిన రియాజ్ అనే యువకుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రియాజ్ తన బైక్‌పై రిన్సీని వెంబడించి ఆమె వెళ్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఆమె కింద పడింది. తర్వాత రియల్ వెంట తెచ్చుకున్న కత్తితో రిన్సీ మీద దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమె శరీరం మీద దాదాపు 30కి పైగా గాయాలు అయ్యాయి. తన తల్లి మీద దాడి జరుగుతుండటంతో చిన్నారులు గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు.

చిన్నారుల ఏడుపులు విన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించాలని ప్రయత్నించగా స్థానికులను కూడా కత్తితో బెదిరించాడు. రియాజ్ ఆమె మీద దాడి చేసి అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికులు రిన్సీ నీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె మరణించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.