చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం

అనంతపురం జిల్లా ధర్మవరంలోని మారుతినగర్‌కు చెందిన పట్టు చీరల వ్యాపారి మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు (25)కు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన ఓ యువతితో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. 55 మందితో తిరుపతికి బయలుదేరిన బస్సు రాత్రి 10 గంటల సమయంలో మార్గంమధ్యలో భాకరాపేట ఘాట్‌లో ఒక్కసారిగా 300 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది.