Lata Mangeshkar Passes Away : లతా మంగేష్కర్ కన్నుమూత.!

Lata Mangeshkar Passes Away : ఇపుడు మన భారతదేశ సినిమా దగ్గర మరో తీరని విషాదం ఇప్పుడు చోటు చేసుకుంది. గత రెండేళ్లలో మన దేశానికీ చెందిన ఎంతోమంది అపారమైన టాలెంట్ కలిగిన నటులు మరియు గాయకులూ తమ తుది శ్వాస విడిచి భారతీయ సినీ పరిశ్రమ దగ్గర లోటు మిగిల్చారు.

అయితే వీరిలో కరోనా కారణంగా మరణించింది మాత్రం గాన గంధర్వలు ఎస్ పి బాలసుబ్రమణ్యం గారు అని చెప్పాలి. ఎన్నో రకాల చికిత్సలు చేసినా వయసు కారణంగా ఆయన్ని వైద్యులు బ్రేటించలేకపోయారు. మరి అక్కడితో ఒక అధ్యాయం ముగియగా ఇప్పుడు ఇంకొక ధృవ తార నేలకొరిగింది.

ఆమెనే భారతీయ గాన కోకికలాగా పిలవబడే లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్. గత కొన్ని రోజులు కితమే ఆవిడ కరోనా కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ కాగా కాస్త క్రిటికల్ గానే ఆరోగ్యం మారింది. తర్వాత ఎలాగో ఆరోగ్యం కుదుటపడి డిశ్చార్జ్ అయ్యారు.

కానీ మళ్ళీ ఈలోపే బాగోలేదని ముంబై ఆసుపత్రిలో చేర్పించగా ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్టు కన్ఫర్మ్ చేసారు. దీనితో సినీ ప్రపంచం అంతా ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యారు.