సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన బ్రహ్మాజీ.. షాక్ లో అభిమానులు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా పలు సినిమాలలో ఎంతో అద్భుతంగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ గురించి అందరికీ సుపరిచితమే. ఆయన కెరియర్ మొదట్లో హీరోగా అవకాశాల కోసం ప్రయత్నించినా చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయారు.ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బ్రహ్మాజీ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండేవారు.

సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈయన తన కామెడీతో అభిమానులను కడుపుబ్బా నవ్వించే వారు.ఈ విధంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులతో ప్రేక్షకులను సందడి చేసే బ్రహ్మాజీ కొన్నిసార్లు తాను చేసే పోస్టుల వల్ల పలు వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో హైదరాబాద్ లో తీవ్ర వరదలు రాగ బ్రహ్మాజీ నాకు పడవలు కావాలి అంటూ కామెడీ చేశారు.ఎంతో మంది వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతూ ఉండగా ఆయన మాత్రం పడవల కావాలి అంటూ కామెడీ చేయడంతో నెటిజన్లు దారుణంగా తిట్టిపోశారు.

అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న బ్రహ్మాజీ ఒక్కసారిగా తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు.బ్రేకింగ్ న్యూస్ అంటూనే ఈయన కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని అందుకే సోషల్ మీడియాకు దూరం అవుతున్నానని తెలిపారు. ఇలా బ్రహ్మాజీ షాకింగ్ డెసిషన్ తీసుకోవడంతో ఒక్కసారిగా నెటిజెన్స్ ఆశ్చర్యపోయారు. అసలు బ్రహ్మాజీకి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నఫలంగా సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నారని పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. బ్రహ్మాజీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల సోషల్ మీడియాకు కొంత కాలం పాటు దూరంగా ఉండాలని భావించినట్లు వార్తలు వస్తున్నాయి