అల్లు అర్జున్ తో మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో?

ప్రస్తుత కాలంలో సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన విజయాలను అందుకోవడంతో ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు సౌత్ సినిమాల్లో నటించడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు సౌత్ సినిమాలపై పలు విమర్శలు చేసిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇలా బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండస్ట్రీ అనేలా కొన్ని రోజులపాటు ఈ సినీ ఇండస్ట్రీలపై మాటల యుద్ధం నడిచింది. ఇకపోతే తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ కుమార్ నటించినటువంటి పృథ్వీ రాజ్ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో ఈయన పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అక్షయ్ కుమార్ నార్త్ సౌత్ ఇండస్ట్రీల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దయచేసి సౌత్ నార్త్ అని బేదాలు ఎవరు చూపించకండి. అంతా ఓకే పరిశ్రమ మనది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప సినిమా విజయం గురించి ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీకి పుష్ప సినిమా రూపంలో పెద్ద విజయం దక్కిందని ఆయన వెల్లడించారు.

అదే విధంగా తాను అల్లుఅర్జున్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ వెల్లడించారు.కేవలం అల్లుఅర్జున్ తో మాత్రమే కాదని సరైన కథ దర్శకుడు దొరికితే తాను సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలతోనూ మల్టీస్టారర్ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే ప్రస్తుత కాలంలో సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్లడంతో పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సౌత్ హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.