Bhagyashree: అందుకే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నా: నటి భాగ్యశ్రీ

Bhagyashree: మైనే ప్యార్ కియా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నటి భాగ్యశ్రీ. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే నటి భాగ్యశ్రీ తాజాగా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా మార్చి 11 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భాగ్యశ్రీ మళ్లీ సినిమాల్లో నటించడం గురించి మాట్లాడుతూ.. మైనే ప్యార్ కియా సినిమా తర్వాత మరి కొన్ని సినిమాలు చేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాను అని తెలిపింది.

ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు పిల్లల పోషణ కారణంగా సినిమాలు నటించలేదని, ప్రస్తుతం పిల్లలు పెద్దవాళ్లు అయ్యారని, అదే కాకుండా పిల్లలు తన భర్త తిరిగి సినిమాల్లో నటించమని సపోర్ట్ చేస్తున్నారని తెలిపింది. దీనితో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాను. ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్, బాలీవుడ్ బ్యూటీ కంగానా నటించిన తలైవి సినిమాలలో యంగ్ మదర్ క్యారెక్టర్ చేసే అవకాశాలు లభించాయి అని తెలిపింది. రాధేశ్యాం సినిమాలో ప్రభాస్ లాంటి గొప్ప నటుడికి తల్లి పాత్రలు చేశారు గర్వంగా ఉంది అని తెలిపింది. అంతేకాకుండా కేవలం మదర్ క్యారెక్టర్ అని మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న అన్ని పాత్రలు చేయాలని ఉంది అని తెలిపింది భాగ్యశ్రీ.