బిట్ కాయిన్ ఓ బుడగ … ఏదోరోజు పేలిపోవడం పక్కా !

గత కొద్దీ రోజులుగా దూసుకుపోతున్న బిట్ కాయిన్‌పై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిట్ కాయిన్ విలువ విపరీతంగా పెరగడాన్ని ఆయన బుడగతో పోల్చారు. మార్కెట్ పోకడలకు సంబంధించి ఇదో క్లాసిక్ ఉదాహరణ అని పేర్కొన్నారు.

Bitcoin prices plunge more than 20% in three days. It's now in a bear  market - CNN

ఓ జాతీయ ఛానెల్‌కు బుధవారం నాడు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఓసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించండి..గత ఏడాది మొదట్లో పది వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ నేడు ఏకంగా 40 వేల డాలర్లకు చేరుకుంది. వాస్తవంగా దీని వల్ల ఎటువంటి విలువా చేకూరదు.

ఈ కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయడం కూడా కష్టమే. అయినా కానీ బిట్ కాయిన్ విలువ 40 వేల డాలర్లకు చేరుకుంది. భవిష్యత్తులో దీని విలువ మరింత పెరుగుతుందని మదుపర్లు నమ్ముతున్నారు కాబట్టే బిట్ కాయిన్‌‌పై ఆసక్తి నానాటికీ పెరిగిపోతోంది. ఈ వైఖరి ఓ బుడగ లాంటిది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2008 ఆర్థిక మాంద్యం ప్ర‌భావాన్ని ముందే ప‌సిగ‌ట్టిన ఆర్థిక వేత్త ర‌ఘురామ్ రాజ‌న్‌. ఒక‌వేళ ప్ర‌పంచం మ‌రో సంక్షోభంలో చిక్కుకుంటే బిట్ కాయిన్‌, టెస్లా విలువ బుడ‌గ మాదిరిగా దూసుకెళ్తాయ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. బుడ‌గ వంటి మార్కెట్ల ధోర‌ణి, ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి విధానం స‌ర‌ళ‌త‌రం, త‌క్కువ వ‌డ్డీరేట్లు ఇవ‌న్నీ బిట్ కాయిన్ విలువ పెరుగ‌డానికి కార‌‌ణం అన్నారు.