Bigg Boss: కరోనా బారిన పడిన ఇద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు.. ఎవరంటే?

Bigg Boss: దేశవ్యాప్తంగా మరొకసారి కరోనా విజృంభిస్తోంది. గతంలో వచ్చిన కరోనా మహమ్మారి తో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన కరోనా మహమ్మారి అందరి గుండెల్లో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలోనే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇప్పటికే ఎంతోమంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే కరోనా మహమ్మారి ఎక్కువగా తెలుగు సినీ ఇండస్ట్రీని పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్ బారిన పడిన సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో ఎంతోమంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్, మహేష్ బాబు,తమన్నా, కమల్ హాసన్ ఇలా పలువురు ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా మరొక ఇద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వారిలో ఒకరు కౌశల్ కాగా, మరొకరు సరయు. ఈ ఇద్దరు కంటెస్టెంట్ లకు తాజాగా కరోనా మహమ్మారి నిర్ధారణ అయినట్లు వారు సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ఇద్దరికి స్వల్ప లక్షణాలు ఉన్నాయని అందువల్లే, ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా వారిద్దరీతో ఒక వారం రోజుల పాటు కలిసి తిరిగిన ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని వారు కోరారు.

ఈ క్రమంలోనే కౌశల్ వ్యాక్సిన్ వేయించుకోండి.. భౌతిక దూరాన్ని పాటించండి.. మాస్కులు ధరించండి.. కరచాలనం.. షేక్ హ్యాండ్ లు ఇవ్వడం ఇలాంటివి చేయకండి.. అలాంటివీ చేసి నేను ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు అని చెప్పుకొచ్చాడు కౌశల్. వీరిద్దరితో పాటు మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన
యాని మాస్టర్ కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కలిసి చేతులా ఈవెంట్ తోనే అనీ మాస్టర్ కు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా జరిగిన ఈవెంట్ లో అనీ మాస్టర్ తో సరయు బాగా క్లోజ్ గా కనిపించింది.