నువ్వు ఎవ‌డ్రా అంటూ అభిపై ఫైర్ అయిన అమ్మ‌.. ఈడెవ‌డు భ‌య‌ప‌డరు అన్న అభి

బిగ్ బాస్ హౌజ్‌లో స‌ర‌దాలు, సంతోషాలే కాదు ఒక్కోసారి మాట‌ల తూటాలు కూడా పేలుతుంటాయి. ముఖ్యంగా నామినేష‌న్ స‌మ‌యంలో ఇంటి స‌భ్యుల మ‌ధ్య ఎంత‌టి ర‌చ్చ జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క‌ర్లేదు. మ‌న‌సులో బాధ‌ల‌ను వెళ్ళ‌గ‌క్కుతూ నోరుపారేసుకుంటారు. అయితే తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో అమ్మ రాజ‌శేఖ‌ర్ హౌజ్ ద‌ద్ద‌రిల్లేలా అరిచారు. చుట్టూ ఉన్న హౌజ్‌మేట్స్ బిత్త‌ర‌పోయి అలా చూస్తుండిపోయారు

శ‌నివారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ స్టేజ్‌పై నుండి ఇంటి స‌భ్యుల‌తో మాట్లాడిన నోయ‌ల్‌.. అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో పాటు అవినాష్‌ను ఒంటి కాలుపై నిలుచోపెట్టాడు. నా అనారోగ్యాన్ని హేళ‌న చేస్తూ మాట్లాడ‌డం కామెడీనా అంటూ వారిపై విరుచుకుప‌డ్డారు. నోయ‌ల్‌పై అవినాష్‌, మాస్ట‌ర్ ఎదురు దాడి చేస్తుంటే మ‌ధ్య‌లో దూరిన అభిజిత్ వారికి న‌చ్చ‌జెప్పి ముగింపు ప‌లికాడు. అయితే ఇదే ఇష్యూపై ఏమైన చ‌ర్చ జ‌రిగిందో ఏమో కాని అభిజిత్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌ల మ‌ధ్య మాటా మాటా పెరిగింది. నువ్వు ఎవ‌డ్రా అనుకునే దాకా వెళ్ళింది.

 

ప్రోమోలో అమ్మ రాజ‌శేఖ‌ర్ గ‌ట్టిగా అరుస్తూ.. నువ్వు ఎవ‌డ్రా, క‌ష్ట‌ప‌డి పైకొస్తొనే తెలుస్తుంది అని అన్నాడు. దీనికి అభిజిత్.. అంద‌రు క‌ష్ట‌ప‌డే పైకొచ్చారు. ఊరికే క‌ష్టం క‌ష్టం, ప్ర‌తి సారి క‌ష్ట‌మా,మేం ఇంత క‌ష్టం, అంత క‌ష్టం అని అరిసాడు. దీనికి అమ్మ.. నువ్వు ఏం క‌ష్ట‌ప‌డుతున్నావ్ పోయి చైర్‌లో కూర్చొని ఉన్నావ్ అన్నాడు. ఎవ‌డు డిస్ట్ర‌బ్ చేయ‌డు, నీకు భ‌య‌ప‌డ‌రు కూడా ఎవ‌డు అంటూ అభిజిత్ న‌డుచుకుంటూ వెళ్లాడు. మొత్తానికి ఇద్దరి మ‌ధ్య సాగిన మాట‌ల యుద్ధం చూస్తుంటే నేటి ఎపిసోడ్ ఫుల్ హీటెక్కిస్తుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లోను త‌ప్ప‌క వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి కాబ‌ట్టి ఈ రోజుహౌజ్ రంగ‌స్థ‌లంగా మార‌నుండ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.