యూట్యూబ్ వదిలేశాడని వస్తున్న విమర్శలపై స్పందించిన షణ్ముఖ్ జస్వంత్…!

ఫేస్ బుక్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబర్ గా మంచి గుర్తింపు పొందిన షణ్ముఖ్ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ ఆ సీజన్లో రన్నరప్ గా నిలిచాడు. యూట్యూబర్ గా మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరిస్ లతో మంచి గుర్తింపు వచ్చింది. షణ్ముఖ్ కి బిగ్ బాస్ కలిసిరాలేదు. ఈ రియాలిటీ షో వల్ల షణ్ముఖ్ నెగిటివిటి మూటకట్టుకొని బయటికి వచ్చాడు.

బిగ్ బాస్ హౌస్ లో సిరితో షణ్ముఖ్ హద్దులు దాటి ప్రవర్తించటం వల్ల ప్రేక్షకుల్లో అతనికి ఉన్న క్రేజ్ తగ్గిపోయింది. బయట తన కోసం తను ప్రేమించిన అమ్మాయి ఉందని గుర్తులేకుండా సిరితో రొమాన్స్ చేశాడు. షణ్ముఖ్ ప్రవర్తనను చూసి తట్టుకోలేక అతను బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే దీప్తి బ్రేకప్ చెప్పింది. ఇలా బిగ్ బాస్ కారణంగ షణ్ముఖ్ 5 సంత్సరాల ప్రేమను వదులుకోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత షణ్మఖ్ మళ్లీ తన పనిలో బిజీ అయిపోయాడు. తనకు ఇంతటి గుర్తింపు రావడానికి కారణం యూట్యూబ్. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగానే మొదటి ప్రాజెక్టు యూట్యూబ్ లో చేస్తానని షణ్ముఖ్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తన స్నేహితుడు, డైరెక్టర్ అయిన సుబ్బుతో కలిసి ఏజెంట్ ఆనంద్ సాయి అనే వెబ్ సీరీస్ చేశాడు. ఆ సీరిస్ యూట్యూబ్ కోసమని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఇటీవల దానిని ప్రముఖ ఓటీటి సంస్థ ఆహాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో షణ్ముక్ యూట్యూబ్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఇప్పుడు షణ్ముఖ రేంజ్ మారడం వల్ల యూట్యూబ్ ని పక్కన పెట్టేశాడని కామెంట్స్ చేయటంతో.. షణ్ముఖ స్పందిస్తూ.. నేను కూడా యూట్యూబ్ ని చాలా మిస్ అవుతున్నాను కచ్చితంగా ఒక స్పెషల్ ప్రాజెక్ట్ తో యూట్యూబ్ ద్వార మీ ముందుకి వస్తా అంటూ చెప్పుకొచ్చాడు.