వైల్డ్ కార్డ్ ఎంట్రీతో చరిత్ర సృష్టించిన బాబా భాస్కర్.. ప్రశంశలు కురిపించిన బిగ్ బాస్..!

ఓటిటిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో చివరి దశకు చేరుకుంది. మునుపటి సీజన్లో అలాగే ఈ నాన్ స్టాప్ సీజన్ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ నాన్ స్టాప్ సీజన్ చివరి దశకు చేరుకునే సమయానికి బిగ్ బాస్ హౌస్ లో ఏడు మంది కంటెస్టెంట్ లు కొనసాగుతున్నారు. వీరిలో అఖిల్, అనిల్, శివ, మిత్రా, అరియానా, బిందు మాధవి, బాబా భాస్కర్ ఉన్నారు. గ్రాండ్ ఫినాలేకి చేరువవటంతో సోమ వారం నుండి కంటెస్టెంట్ ల మధ్య గట్టి పోటీ జరుగుతుంది.

ఇదిలా ఉండగా గత రెండు రోజుల నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు బిగ్ బాస్ సర్ప్రైజ్ లు ఇస్తున్నాడు. ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నాన్ స్టాప్ సీజన్ లో అడుగుపెట్టి బాబా భాస్కర్ మాస్టర్ కి వచ్చి రావడంతోనే బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన బాబా భాస్కర్ కి ఇంట్లో ఉన్న సభ్యులలో ఒకరిని కాపాడే అవకాశం ఇవ్వగా.. బాబా భాస్కర్ బిందూని సేవ్ చేసాడు. దీంతో బిందూ అభిమానుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు.

అలాగే హౌజ్ లో బాబా భాస్కర్ కి కెప్టెన్సీ పదవిని కూడా ఇచ్చారు. అంతే కాకుండా మంచి ఎంటర్టైనర్ గా నిరూపించుకోవటానికి బిగ్ బాస్ చాలా అవకాశాలు ఇచ్చాడు. దీంతో బాబా భాస్కర్ చాలా ఈజీగా ఫినాలే వరకూ చేరుకున్నాడు. అయితే ఇటీవల బుధవారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ బాబా భాస్కర్ మాస్టర్ స్పెషల్ వీడియో ప్లే చేశాడు. 35 నిమిషాల పాటు సాగే ఈ వీడియో చూసిన బాబా ఎమోషనల్ అవుతూ ..నాకు కప్పు వద్దు, సొమ్ము వద్దు ఇప్పుడే గేట్లు తెరవండి నేనూ బయటికి వెళ్ళిపోతా అంటూ ఆనందంతో పొంగిపోయాడు. దీంతో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వారు ఇలా ఫైనల్ కి చేరుకోవడం ఇదే మొదటిసారి. నువ్వు చరిత్ర సృష్టించావు అంటూ బాబా మీద ప్రశంశలు కురిపించాడు.