BigBoss Nonstop: దుర్మార్గమైన టాస్క్ లు ఇస్తున్నారంటూ బిగ్ బాస్ ని ఏకిపారేస్తున్న నెటిజన్లు…!

BigBoss Nonstop: ఓటిటి లో ప్రసమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో పూర్తి చేసుకుని గ్రాండ్ ఫినాలే కు దగ్గరవుతుంది. తెనాలి ఎక్కువ చేరువయ్యే కొద్దీ హౌస్ లోని కంటెస్టెంట్ ల మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతోంది. ప్రతివారం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సభ్యుల మధ్య సభ్యులు ఒకరినొకరు నిందించుకుంటూ రచ్చ చేస్తున్నారు. గడిచిన వారం ఆశు రెడ్డి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం బిందు మాధవి, అరియానా, అనిల్, అఖిల్ మిత్రశర్మ ,బాబా భాస్కర్ మాస్టర్, నట్రాజ్ మాస్టర్, శివ తదితరులు కొనసాగుతున్నారు.

ప్రతి సోమవారం నామినేషన్స్ వల్ల మంచి ఎంటర్టైన్మెంట్ అందుతోంది. అదే సమయంలో సభ్యుల మితిమీరిన ప్రవర్తన కారణంగా ప్రేక్షకులు విసుగు చెందుతున్నారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కరు టాప్ 5 లో ఉండేందుకు అర్హతలేని ముగ్గురు సభ్యులను ఎంపిక చేయమని బిగ్ బాస్ ఆదేశించాడు . ఈ టాస్క్ కారణంగా ఇంటి సభ్యుల మధ్య భారీ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి మూర్ఖమైన టాస్క్ లు ఎలా ఇస్తున్నారు అంటూ ప్రేక్షకుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ ఇలాంటి టాస్క్ లు ఇవ్వటంతో ఇంటి సభ్యులు మరింత రెచ్చిపోయి వ్యవహరిస్తున్న తీరు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నామినేషన్స్ లో భాగంగా బిందుమాధవి నటరాజు మాస్టర్ ని నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య భారీ స్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో నటరాజు మాస్టర్ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందంటూ ప్రేక్షకుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హౌస్ లో జరిగే ఇలాంటి విషయాలలో ప్రేక్షకులు చూడకుండా డిలీట్ చేసే అవకాశం బిగ్ బాస్ కి ఉన్నప్పటికీ బిగ్ బాస్ అలా చేయకుండా రేటింగ్స్ కోసం కక్కుర్తి పడుతున్నారు. రేటింగ్స్ కోసం మాత్రమే నట్రాజ్ మాస్టర్ ని హౌస్లో ఉంచినట్లు ప్రేక్షకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే తే బిగ్బాస్ ప్రేక్షకుల ఆదరణ కోల్పోవడం ఖాయం.