Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం పై మండిపడిన బిగ్ బాస్… రోజంతా దానిని దూరం చేసిన బిగ్ బాస్!

Ashu Reddy: బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ వారంలోకి అడుగుపెట్టింది. 9వ వారంలో భాగంగా ఏడు మంది కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు. ఇకపోతే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ సభ్యులను హ్యూమన్స్, ఏలియన్స్ అని విభజించారు. ఈ క్రమంలోనే హ్యూమన్స్ టీమ్ లో అఖిల్, శివ, అషు, అనిల్, మిత్రాలు ఉన్నారు. మిగిలిన వాళ్లు ఏలియన్స్‌గా, బాబా భాస్కర్ సంచాలకుడిగా వ్యవహరించారు.

ఈ టాస్క్ లో భాగంగా హ్యూమన్స్ అరచేతులపై ఏలియన్స్ రంగులు చల్లాలి. అలాగే ఏలియన్స్ దగ్గర ఉన్న కుండలను హ్యూమన్స్ దక్కించుకోవాలని బిగ్ బాస్ చూచించారు. ఈ క్రమంలోనే హ్యూమన్స్ టీమ్ లో ఉన్నటువంటి మిత్రశర్మ స్విమ్మింగ్ పూల్ లో ఉండగా ఏలియన్ టీమ్ సభ్యులు తనపై రంగులు వేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారిని ఆపడం కోసం ఆశు రెడ్డి వారిపై నీళ్లు చల్లారు.ఇలా ఈమె నీళ్లు చల్లడం తో వారి మైకులు మొత్తం నానిపోయాయి.

ఆశు రెడ్డి ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించడంతో బిగ్ బాస్ తనకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇలా ప్రవర్తించినందుకుగాను ఆమెకు ఒక రోజు మొత్తం మైక్ లేకుండా పనిష్మెంట్ ఇచ్చారు. ఇలా పనిష్మెంట్ ఇవ్వడంతో ఆ రోజు మొత్తం హౌస్ సభ్యులతో అషు రెడ్డి మాట్లాడడానికి వీలు లేదు. ఇలా బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కాసేపు మౌనంగా కూర్చున్న ఆశు రెడ్డికి బిగ్ బాస్ మరోసారి వార్నింగ్ ఇస్తూ ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగకూడదని తన మైక్ ఇచ్చారు. ఈ విధంగా బిగ్ బాస్ చరిత్రలో కంటెస్టెంట్ ల మైక్ లాక్కోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.