Bhalakrishana: త్వరలోనే బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి పడనున్న ఎండ్ కార్డ్.. అసహనం వ్యక్తం చేస్తున్న అభిమానులు..!

Bhalakrishana: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న బాలకృష్ణ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి మొదట్లో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని తెలియడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. బాలకృష్ణ ఏంటి హోస్టింగ్ చేయడం ఏంటి అని సందేహం వ్యక్తపరిచారు. అయితే ఈ కార్యక్రమం ప్రసారం అయిన తర్వాత బాలకృష్ణ హోస్టింగ్ కి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు హాజరై వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇందులో రవితేజ పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి త్వరలోనే ముగింపు చెప్ప బోతున్నారని ఆహా అధికారికంగా తెలియజేసింది. త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్ ప్రసారం చేస్తూ సీజన్ 1 ముగిసినట్లు సమాచారం.

ఇలా ఈ కార్యక్రమం ఎంతో ప్రేక్షకాదరణ పొంది ఇంత తొందరగా పూర్తి అవుతుందని తెలియడంతో ఎంతోమంది అభిమానులు ఈ కార్యక్రమం పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టుమని పది ఎపిసోడ్లు కూడా పూర్తికాకుండానే ఈ కార్యక్రమం పూర్తి కావడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే రెండవ సీజన్ కూడా ప్రారంభించాలని రిక్వెస్ట్ చేయడం గమనార్హం. ఇక మహేష్ బాబు అతిథిగా వచ్చిన ఎపిసోడ్ సంక్రాంతికి ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.