బండి సంజయ్ దూకుడును ఆపే మగాడే లేడా?

bandi sanjay shocking decision

తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఇదివరకు కేసీఆర్ అనేవారు. కానీ.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బండి సంజయ్. ఇంతకీ ఎవరీయన. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. అంతేనా.. కరీంనగర్ ఎంపీ కూడా. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రాజ్యమేలుతున్న సమయంలో లైమ్ లైట్ లోకి వచ్చి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి.. బీజేపీ సత్తాను చాటారు బండి సంజయ్.

bandi sanjay shocking decision
bandi sanjay shocking decision

అంతే కాదు.. బీజేపీ అధ్యక్షుడిగా తెలంగాణలో బీజేపీ గెలుపునకు నాంది పలికారు. దుబ్బాక ఉపఎన్నికతో పాటు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు బండి ఎంతో దోహదం చేశారు. అందుకే బండి సంజయ్ పేరు కేంద్రం వరకు వెళ్లింది. కేంద్రం నుంచి కూడా సంజయ్ కి అభినందనలు వచ్చాయి.

అందుకే.. బండి సంజయ్ దూకుడు మీద ఉన్నారు. అస్సలు ఆగడం లేదు. ఎవ్వరు ఆపినా ఆగడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో బండి సంజయ్ ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ వచ్చేసింది అంటూ బల్లగుద్ది మరీ చెప్పారు బండి సంజయ్.

కట్ చేస్తే.. తాజాగా బండి సంజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే పాదయాత్ర. అవును.. త్వరలోనే ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం తెలంగాణ వ్యాప్తంగా బండి పాదయాత్ర నిర్వహిచనున్నారట. అది కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుందట. కాకపోతే.. ఇప్పుడు కాదు.. త్వరలోనే పాదయాత్ర ఉంటుందట. వామ్మో.. ఇదేం దూకుడు సామీ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ఇలా దూసుకుపోతున్నారు అంటే మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు ఇక.