21 ఏళ్ల క్రితం 30 కోట్ల వసూళ్లు రాబట్టిన బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలయ్య అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఈ విధంగా బాలకృష్ణ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమాల గురించి చెప్పుకోవాల్సి వస్తే అందులో నరసింహనాయుడు ఒకటిగా చెప్పుకోవాలి. బాలకృష్ణ సిమ్రాన్ జంటగా నటించిన ఈ సినిమా 2001లో విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలనంగా మారింది.

డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన నాలుగో సినిమా నరసింహ నాయుడు. అప్పట్లోనే ఈ సినిమా సంక్రాంతికి విడుదలయి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో మొదటిసారిగా 105 కేంద్రాలలో 100 రోజులు ఆడిన సినిమాగా నరసింహనాయుడు సినిమా నిలబడింది. అప్పట్లోనే ఈ సినిమా ఏకంగా 30 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి సంచలనంగా మారిందని చెప్పాలి.

2001 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ మృగరాజు, దేవి పుత్రుడు సినిమాకు గట్టిపోటీ ఇస్తూ ఈ మూడు సినిమాలలో బాలక్రిష్ణ నరసింహనాయుడు సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సృష్టించగా, మృగ రాజు డిజాస్టర్ గా మిగిలిపోయింది. దేవి పుత్రుడు మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ సినిమాకు బాలయ్య నటన హైలెట్ కావడమే కాకుండా మణిశర్మ సంగీతం, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ సినిమాకి హైలైట్ అయ్యాయి. తర్వాత బాలకృష్ణ సమరసింహా రెడ్డి, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు కూడా ఇదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేశాయి.