గ్రాండ్ ఫినాలే లో అసంతృప్తి చెందిన బాబా భాస్కర్.. కారణం అదేనా..?

ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ నిన్నటితో ముగిసింది .18 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ నాన్ స్టాప్ రియాలిటీ షోలో ఏడు మంది కంటెస్టెంట్ లు గ్రాండ్ ఫినాలే వరకు చేరుకున్నారు. వీరిలో అఖిల్, బిందు మొదటి రెండు స్థానాల్లో నిలవగా, శివ మూడోస్థానంలో నిలిచాడు. నాల్గవ స్థానంలో అరియన, తర్వాతి స్థానాలలో మిత్ర, బాబా భాస్కర్, అనిల్ ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన బాబా భాస్కర్ మాస్టర్ టాప్ 7 లో నిలిచి ఫినాలే వరకు చేరుకున్నాడు. ఈ గ్రాండ్ ఫినాలేలో మొదట అనిల్‌ రాథోడ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు.

తర్వత బాబా భాస్కర్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి సత్యదేవ్ చేతుల మీదుగా బయటకు వచ్చాడు.హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన బాబా మాస్టర్‌ స్టేజ్‌పైకి రాగానే ఆయన భార్యకి దండం పెట్టాడు. అప్పుడు నాగార్జున భలే కవర్‌ చేస్తున్నావ్ కదా ? అన్నట్లుగా సెటైర్‌ వేశాడు. తర్వత బాబా భాస్కర్ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు. ఈ రియాలిటీ షో కి రావడం చాలా ఆనందంగా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి సీక్రెట్ రూమ్ లో ఉంటూ, ఎవిక్షన్‌ పాస్‌ రావడం చాలా బాగా అనిపించాయి.

కానీ ఈ సీజన్ కంటే మునుపటి సీజన్ అనుభవం చాలా బాగుంది. అప్పుడు బిగ్ బాస్ గురించి ఏమీ తెలియదు కాబట్టి చాల ఎక్సైటింగ్ గా ఉండేది. కానీ ఈ సీజన్ లో అంత ఎక్సైట్మేట్ లేదు.కానీ ఈ రోజు శ్రీకాంత్ డబ్బులు తీసుకుని లోపలికి వస్తే వాటిని తీసుకొని సంతోషంగా వెళ్ళిపోదామనుకున్నాను. కానీ అలా జరగలేదు. అది ఒకటి మాత్రమే అసంతృప్తిగా ఉంది. ఈ క్రమంలో టైటిల్ విన్నర్ ఎవరు అవతారని నాగార్జున అడగగా బిందు పేరు చెప్పాడు. తర్వాత అఖిల్, శివ పేర్లు కూడా చెప్పి ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కచ్చితంగా టైటిల్ గెలుచుకుంటారు అని చెప్పాడు.