Crime News: ప్రియుడి మాయలో పడి సొంత తమ్ముడిని చంపటానికి ప్రయత్నం..!

Crime News: ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు పెట్టుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ అక్రమ సంబంధాల వల్ల భార్య భర్తల మధ్య గొడవలు జరిగి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ అక్రమ సంబంధాల వల్ల మనుషుల మధ్య ఉన్న బంధాలు బంధుత్వాలు మరిచి కొందరు సొంత వారిని కూడా చంపటానికి వెనుకాడటం లేదు. తాజాగా అటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తన అక్రమ సంబంధానికి తమ్ముడు అడ్డుగా వచ్చాడు అని చెప్పి సొంత అక్క తమ్ముడిని హతమార్చడానికి ఇచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే..6 నెలల క్రితం జరిగిన ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ 3న మహ్మద్ సోహైల్ (19) అదృశ్యమయ్యాడు. అతను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల కేసు పెండింగ్ లో పడి మహమ్మద్ సోహెల్ ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు.

తాజాగా మహమ్మద్ సోహెల్ కనిపించకుండా పోవడానికి గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. మహమ్మద్ సోహెల్ అక్క ఫాతిమా , మెట్‌పల్లికి చెందిన సయ్యద్ సజ్జాద్‌ల ప్రేమ విషయం తెలుసుకున్న మహమ్మదు సోహైల్ వారి ప్రేమను నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఫాతిమా తన ప్రియుడితో కలిసి ఇ లక్ష రూపాయలు ఇచ్చి తమ్ముడిని చంపించింది. ఫాతిమా ప్రియుడు మైనర్ బాలుడు సహాయంతో మహమ్మద్ సోహైల్ ను హత్య చేసి కాలువలో పడేశారు. తాజాగా హత్య కు సహకరించిన మైనర్ బాలుడికి, ఫాతిమా ప్రియుడికి మధ్య డబ్బు విషయంలో విభేదాలు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సయ్యద్ సజ్జాద్ తానే స్వయంగా వచ్చి పోలీస్స్టేషన్లో లొంగిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటివరకు మహమ్మద్ సోహెల్ శవం కనిపించకపోవడం గమనార్హం.