Crime News: వివాహేతర సంబంధం నెపంతో మహిళపై దాడి.. కానిస్టేబుల్ ప్రమేయం ఉండటంతో…!

Crime News: ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోయి పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఈ వివాహేతర సంబంధాల కారణంగా కొందరు భార్య భర్తలు విడిపోతుంటె మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటన్నిటికీ మించి మరికొందరు మంచం ఈ వివాహేతర సంబంధాల కారణంగా హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇటీవల కడప జిల్లాలో ఇటువంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన షేక్‌ మున్నీసాకు కలసపాడు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడిపోయారు.ఈ క్రమంలో మున్నీసా పోరుమామిళ్లలోని సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్న ఆ సమయంలో ఆ సూపర్ మార్కెట్ యజమాని మాబు హుస్సేన్‌తో మున్నీ వివాహేతర సంబంధం పెట్టుకొని పలుమార్లు శారీరకంగా కూడా కలిశారు. ఈ తరుణంలో ముని గర్భవతి కావడంతో మాబు హుస్సేన్‌ కుటుంబ సభ్యులు మున్నీ తో గొడవకి దిగారు.దీంతో ఆమె పని మానేసి గిద్దలూరు కి మకాం మార్చింది.

అయినప్పటికీ మాబు హుస్సేన్ కుటుంబంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీనంతటికీ మున్నీనే కారణమని భావించిన మాబు హుస్సేన్‌ కుటుంబ సభ్యులు కానిస్టేబుళ్లు సయ్యద్‌, జిలానీలను వెంటబెట్టుకుని సోమవారం సాయంత్రం గిద్దలూరు వెళ్లారు. కానిస్టేబుళ్లు ఆమెను కొడుకు అక్కడి నుండి పోరుమామిళ్ల కు తీసుకు వచ్చి కుటుంబ సభ్యులతో సహా ఆమె మీద దాడి చేయడంతో మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనపై
మహిళ దారుణ హత్యపై ఏపీ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను వెంటనే అరెస్టూ చేసి, బాధితులకు న్యాయం చేయాలని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు.