Crime News: ఖమ్మం జిల్లాలో దారుణం.. బావ వేధింపులు తాళలేక దారుణానికి పాల్పడిన యువతి..!

Crime News: ఈ రోజుల్లో మహిళలకు తమ బంధువుల వద్ద కూడా రక్షణ లేకుండా పోతుంది. తండ్రి లేని మరదలికి తండ్రి స్థానంలో నిలబడి పెళ్లి చేయాల్సిన బావ ఆమె మీద కన్నేసి వేధింపులకు పాల్పడిన ఘటన ఇటీవల కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లాలో ఈ దారుణం ఇటీవల చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే…ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలోని భగవాన్ నాయక్ తండాకు చెందిన గుగులోతు శ్రీను, చిన్ని దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. కొంతకాలం క్రితం శ్రీను అనారోగ్యంతో మరణించగా తన ఐదుగురు పిల్లల బాధ్యతలు చిన్ని తీసుకుంది. ఎలా తన పిల్లలను పెంచి పోషించే వారిలా నలుగురికి పెళ్లిళ్లు చేసింది. ఇటీవల చిన్న కూతురికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయించి ఏప్రిల్ 10వ తేదీన పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు. పెళ్లికి సంబంధించి అన్ని పనులు కూడా మొదలు పెట్టారు.

ఈ తరుణంలో చిన్ని మూడవ అల్లుడు సంతోష్ తన చిన్న కూతురు మీద కన్నేశాడు.ఎలాగైనా మరదల్ని తన సొంతం చేసుకోవాలని భావించి తనలో దాగివున్న సాడిజన్ని బయటపెట్టడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో తనని పెళ్లి చేసుకోవాలంటే మరదలి నీ ఒత్తిడి చేశాడు.తనని దక్కించుకోవడం కోసం కుటుంబ సభ్యులను కూడా తీవ్ర చిత్రహింసలకు గురి చేయటం మొదలు పెట్టాడు.సంతోష్ వేధింపులు భరించలేక తల్లి చిన్న కూతురు ఇద్దరు కలిసి వేరే ఇంటికి మకాం మార్చారు.అయినప్పటికీ సంతోష్ అక్కడికి కూడా వెళ్లి వారితో గొడవ పెట్టుకునే వాడు.

ఇలా రోజు రోజుకి తిన్న బావ వేధింపులు ఎక్కువ అవుతుండటంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఈనెల 22వ తేదీ అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ పురుగుల మందు తాగిన తర్వాత యువతి వాంతులు చేసుకోవడం గమనించిన తల్లి కూతురిని కాపాడుకోవాలని హుటాహుటిన ఖమ్మం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.యువతి చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆమె పరిస్థితి విషమించి మరణించింది.తన చిన్న కూతురు మరణించటానికి తన అల్లుడే కారణమని చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె చావుకు కారణమైన సంతోష్ ని అదుపులోకి తీసుకున్నారు.