Vastu Tips: చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడుతున్నాయా.. ఎండు మిర్చితో ఈ పరిహారం చేయండి!

Vastu Tips: భారతీయ సాంప్రదాయం ప్రకారం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే మన ఇంట్లో ఏదైనా సమస్యలు ఎదురైనా, చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడుతున్నా వెంటనే వాస్తు పరిహారాలను పాటిస్తాము. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి దోషాలు తొలగి పోవడం కోసం వాస్తు శాస్త్రంలో ఎన్నో పరిహారాలు ఉన్నాయని చెప్పవచ్చు.ముఖ్యంగా మనం చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడితే ఆ పనులు నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఎండుమిర్చితో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. మరి ఆ పరిహారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

మీరు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించాలనుకున్నా లేదా ఏదైనా శుభకార్యాలు చేయాలనుకున్నా తరచు ఆటంకాలు ఏర్పడుతుంటే ఎండుమిర్చితో ఈ పరిహారం చేస్తే మీ పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. 21 ఎండు మిరపకాయలను తీసుకొని ప్రతి రోజు ఉదయం సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తూ, ‘ఓం తుష్టాయ నమః’ అనే మంత్రాన్ని జపించండి. ఇది మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది. ఇలా ఈ పరిహారాన్ని 21 రోజుల పాటు పాటించాలి.

దీనితో పాటు 7 ఎండు మిరపకాయలను ఒక రుమాలలో చుట్టి మన దగ్గర పెట్టుకోవడం వల్ల మనం చేపట్టే పనులు ఎంతో దిగ్విజయంగా పూర్తి అవుతాయి.ఇలా వారానికి ఒకసారి ఎండు మిర్చిలను మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వివాహంలో వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఇక ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే 7 ఎండు మిర్చిలను ఒక శుభ్రమైన వస్త్రంలో పెట్టి మనం డబ్బు నిల్వ చేసే చోట ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు కూడా ఉండవు.