జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

జనసేన ఆవిర్భావ సభకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,పోలీసులు సభ నిర్వహించుకునేందుకు అనుమతించారు. 14వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు సభకు జరుపుకునేందుకు అనుమతి లభించింది. తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. ముందుగా సభకు అనుమతి లభించదని భావించిన జనసేన.. అవసరం అయితే, హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.