హాస్పిటల్ వద్ద దర్శనమిచ్చిన అనుష్క దంపతులు.. మరోసారి తల్లీ కాబోతోందా..?

బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మ .’రబ్ దే బనా ది జోడీ’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమాలో అనుష్క నటనకు ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. ఈ సినిమా మంచి హిట్ కావడంతో అనుష్క శర్మ సినిమా అవకాశాలు దక్కించుకుంది. దీంతో అనుష్క కొంతకాలానికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అనుష్క శర్మ సినిమాలకి కొంత దూరంగా ఉంది.

అనుష్క శర్మ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి వామిక అనే ముద్దుల పాప కూడ ఉంది. అయితే కూతురు పుట్టిన తర్వాత అనుష్క సినిమాలకి దూరంగా ఉంటూ ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడుపుతోంది. అనుష్క, కోహ్లీ దంపతులు తరచు వేకేషన్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటీవల వీరు తమ కూతురితో కలిసి మాల్దీవులలో చాలాకాలం వెకేషన్ ఎంజాయ్ చేశారు. ఈ నెల 13 వ తేదీ వీరు తిరిగి వచ్చారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అనుష్క శర్మ గురించి ఒక వార్త ప్రస్తుతము సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మాల్దీవ్స్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అనుష్క దంపతులు సోమవారం సాయంత్రం ముంబైలోని కోకిలా బెన్ అంబానీ హాస్పిటల్ వద్ద ఈ దంపతులు దర్శనమిచ్చారు. అయితే అక్కడ ఉన్న వ్యక్తి వీరిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. వెకేషన్ నుండి తిరిగి వచ్చిన వెంటనే కోహ్లీ, అనుష్క దంపతులు ఇలా హాస్పిటల్ కి వెళ్ళటంతో ఏం జరిగి ఉంటుందని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే అనుష్క మరొకసారి తల్లి కాబోతోంది. అందుకే చెకప్ కోసం హాస్పిటల్ కి వచ్చింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా అనుష్క గుడ్ న్యూస్ చెప్పబోతోందా? ఈ వార్త గురించి అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.