వంటలక్కగా మారబోతున్న అనుష్క..!

వెండితెర జేజమ్మ అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమా తర్వాత ఇప్పటివరకు ఏ సినిమాని ప్రకటించలేదు. ఈ విధంగా అనుష్క ఎలాంటి సినిమాలను ప్రకటించకపోవడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే తాజాగా ఈమె నవీన్ పోలిశెట్టి సరసన నటిస్తున్న సంగతి అధికారికంగా వెల్లడించారు.యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాలో అనుష్క పాత్ర ఎంతో విభిన్నంగా ఉంటుందని తెలియజేశారు.

ఇక ఈ సినిమాలో అనుష్క ఇంటర్నేషనల్ చెఫ్ గా మారబోతోంది. ఇలా వంటలక్కగా అనుష్క ఈ సారి సరికొత్త ప్రయోగం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి మహేష్ దర్శకత్వం వహించగా యు.వి.క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మన జాతిరత్నం నవీన్ పోలిశెట్టి జతకట్టారు. జాతి రత్నాలు సినిమా ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమా తర్వాత ఎలాంటి చిత్రాలను ప్రకటించలేదు.ఈ క్రమంలోనే యు వి క్రియేషన్స్ బ్యానర్ నుంచి అవకాశం పొందారు.

ఇక అనుష్క కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో విభిన్న కథలను ఎంపిక చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అరుంధతి, సైజ్ జీరో, నిశ్శబ్దం వంటి విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ కొన్ని మంచి ఫలితాలను ఇవ్వగా మరికొన్ని చేదు ఫలితాలను అందించాయి. ఇకపోతే ఈసారి వంటలక్కగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనుష్క ప్రేక్షకులను ఎలా సందడి చేయనుందో తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా హిట్ కొడితే అనుష్క కెరియర్ మరికొన్ని రోజులపాటు ఇండస్ట్రీలో కొనసాగనుంది లేదా పూర్తిగా ఈమె ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడనున్నాయి.