గుడ్ న్యూస్ చెప్పిన నువ్వు నేను బ్యూటీ..ఆనందంలో అభిమానులు

ఉద‌య్ కిర‌ణ్ హీరోగా తేజ తెర‌కెక్కించిన చిత్రం నువ్వు నేను. ఇందులో అనిత క‌థానాయిక‌గా న‌టించింది. ఈ సినిమాలో ఉద‌య్ కిర‌ణ్‌, అనిత మ‌ధ్య స‌న్నివేశాలు ప్రేక్షకుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌తి స‌న్నివేశంలోను ఇద్ద‌రు అద్భుతంగా న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు పొందారు. నువ్వు నేనుతో మంచి స్టార్‌డం తెచ్చుకున్న అనిత దానిని నిల‌బెట్టుకోలేక‌పోయింది.శ్రీరామ్’ ‘తొట్టి గ్యాంగ్’ ‘నిన్నే ఇష్టపడ్డాను’ ‘ఆడంతే అదో టైపు’ ‘నేను పెళ్ళికి రెడీ’ వంటి చిత్రాల‌లో న‌టించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచాయి. దీంతో టాలీవుడ్‌కు బైబై చెప్పేసి బాలీవుడ్ కు వెళ్ళింది.

నాగిణి అనే హిందీ సీరియ‌ల్‌లో అనిత న‌టించ‌గా, దీంతో అనిత‌కు బాగా క్రేజ్ పెరిగింది. ఈ సీరియ‌ల్ అనిత‌ను అక్క‌డి వారికి ద‌గ్గ‌ర చేసింది. ఈ సీరియ‌ల్ షూట్ చేస్తున్న స‌మ‌యంలో బేబి బంప్ తో ఫొటో షూట్ చేసింది అనిత‌. అప్పుడు ఈమె గ‌ర్బ‌వ‌తి అని అంద‌రు భావించారు. కాని అది రూమ‌ర్ అన్ని కొట్టి పారేసింది. 2013లో పారిశ్రామిక వేత్త రోహిత్‌ను వివాహం చేసుకున్న అనిత రీసెంట్‌గా పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన దంప‌తులు సంతోషం వ్య‌క్తం చేశారు.

అనిత‌కు మ‌గ బిడ్డ జ‌న్మించాడ‌ని తెలుసుకున్న ఆమె అభిమానులు ర‌చ్చ చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో అనిత‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు. అనిత గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్పుడు చాలా ఫొటో షూట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న భ‌ర్త‌తో క‌లిసి అనిత చేసిన ఫొటో షూట్స్ అప్ప‌ట్లో హాట్ టాపిక్‌గా కూడా మారాయి. మొత్తానికి విరాట్‌- అనుష్క జంట త‌ర్వాత అనిత‌-రోహిత్ జంట బేబికు జ‌న్మ‌నిచ్చారు. రానున్న రోజుల‌లో మ‌రి కొంద‌రు కూడా గుడ్ న్యూస్ అందించ‌నున్నారు.