నువ్వు నేను హీరోయిన్ బేబి ష‌వ‌ర్ వేడుక‌… ఫ్రెండ్స్‌తో ర‌చ్చ చేసిన అనిత‌

ఉద‌య్ కిర‌ణ్ హీరోగా తెరకెక్కిన నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన బ్యూటీ అనిత‌. ఈ సినిమా త‌ర్వాత అనిత ‘శ్రీరామ్’ ‘తొట్టి గ్యాంగ్’ ‘నిన్నే ఇష్టపడ్డాను’ ‘ఆడంతే అదో టైపు’ ‘నేను పెళ్ళికి రెడీ’ వంటి చిత్రాల్లో నటించింది. నాగార్జున హీరోగా వచ్చిన ‘నేనున్నాను’ సినిమాలో ఓ పాటలో మెరిసింది. ఆ తర్వాత ఛాన్సులు రాకపోవడంతో టాలీవుడ్‌కు దూరమైంది. కోలీవుడ్‌లో అదృష్టం ప‌రీక్షించుకోగా, అక్క‌డ నిరాశే ఎదురు కావ‌డంతో హిందీలో సీరియల్స్ చేసుకుంటూ కాలం గ‌డుపుతుంది.

అనిత న‌టించిన సీరియ‌ల్స్ హిట్ కావ‌డంతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ క్ర‌మంలోనే 2013లో రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుని లైఫ్‌లో సెటిలైంది. అయితే ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి అన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో నాగిణీ సీరియ‌ల్ కొసం ప్ర‌గ్నెంట్‌గా న‌టించింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైర‌ల్ కావ‌డంతో అంద‌రు ఆమె గ‌ర్భ‌వ‌తి అనుకున్నారు. కాని ఇప్పుడు అనిత నిజంగా‌నే గ‌ర్భ‌వ‌తి కాగా త్వ‌ర‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంది. కొద్ది రోజులుగా క‌డుపుతో ఉన్న ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు థ్రిల్ క‌లిగిస్తుంది.

తాజాగా అనిత త‌న బేబి ష‌వ‌ర్ ఫొటోలు షేర్ చేసింది. నిర్మాత ఏక్తా క‌పూర్ ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో క‌రిష్మా త‌న్నా, క్రిస్టిల్ డిసౌజా, స‌నయ ఇరాని త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. త్వ‌ర‌లో మామ్ కాబోతున్న అనిత ఎల్లో క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసి నెటిజ‌న్స్‌కు థ్రిల్ క‌లిగించింది. బేబి ష‌వర్ వేడుక ఏర్పాటుచేసినందుకు ఏక్తా క‌పూర్‌తో పాటు త‌నుశ్రీ దత్తాకు శుభాకాంక్ష‌లు తెలిపారు అనిత భ‌ర్త‌. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా ఉన్న అనుష్క శ‌ర్మ‌, క‌రీష్మా కపూర్‌లు కూడా త్వ‌ర‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే.