ఉదయ్ కిరణ్ “నువ్వు నేను” మార్చి 21న థియేటర్స్ లో రీ రిలీజ్ !!!

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి ఉదయ్ కిరణ్ కొంత కాలం క్రితం నువ్వు నేను అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనిత హీరోయిన్ గా నటించగా … టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి తేజ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటించగా … ఆర్ పి పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా మామూలు సినిమాగా 2001 వ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా జోరుగా పెరిగాయి. చివరగా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి ఆ సమయంలో బారి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇలా ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీస్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 21న థియేటర్స్ లో రీ రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.