షర్మిల పార్టీలో జాయిన్ కానున్న యాంకర్ శ్యామల..?

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూతురు.. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైయస్ షర్మిల త్వరలో తెలంగాణలో ఓ రాజకీయ పార్టీని స్థాపించిబోతున్నట్టు ప్రకటించిన సంచలనం రేపింది. అంతేకాదు తాను తెలంగాణలో పుట్టిన పెరిగాను. తన అత్తా మామలది తెలంగాణ అంటూ సెంటిమెంట్ కూడా రాజేసింది. అంతేకాదు ఏప్రిల్ 9న కొత్త పార్టీని స్థాపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Anchor Sharmila - YS Sharmila: జగన్‌కు హ్యాండిచ్చి షర్మిల పార్టీలోకి యాంకర్ శ్యామల.. ?

ఈ సందర్భంగా వైయస్ షర్మిలకు ఇప్పటికే తెలంగాణలోని పలువురు ప్రజా ప్రతినిధులు మద్ధుతు కూడా తెలిపారు. మరోవైపు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా వైయస్ షర్మిల పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఈ కోవలోనే ప్రముఖ తెలుగు టీవీ యాంకర్, నటి శ్యామల.. లోటస్‌పాండ్‌లో తన భర్త నరసింహారెడ్డి కలసి షర్మిలతో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా శ్యామల పార్టీ పెడితే.. సినీ ఇండస్ట్రీ నుంచి తొలి కండువా కప్పుకునేది తానే అంటూ చెబోతుంది. మొత్తంగా అన్న వైయస్ జగన్ పార్టీకి హ్యాండిచ్చి ఇపుడు షర్మిల పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గత నెల ఫిబ్రవరి 10న షర్మిల భర్త అనిల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా లోటస్ పాండ్‌ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు శ్యామల దంపతులు. శ్యామల భర్త నరసింహారెడ్డి పలు సీరియల్స్ లో నటిస్తున్నాడు.