భర్త కోసం నిష్టగా వట సావిత్రి పూజ చేసిన అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

యాంకర్ గా బుల్లితెర మీద సందడి చేస్తున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందింది. ఈమె అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పుడు హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈమె షేర్ చేసే ఫోటోల వల్ల చాలాసార్లు విమర్శలు కూడా ఎదుర్కొంది.

ఇదిలా ఉండగా ఇటీవల అనసూయ చాలా సంప్రదాయబద్దంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాకయ్యారు. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ ఇలా సంప్రదాయబద్దంగా కనిపించటానికి కూడా ఒక కారణం ఉంది. అనసూయ తన భర్త యోగక్షేమాల కోసం ఎంతో నిష్టగా మూడూ రోజుల పాటు ఉపవాసం ఉండి వట సావిత్రి పూజ చేసింది. అనసూయ ఒక సెలబ్రిటీ అయినప్పటికీ ఆమె కూడా ఒక మహిళే కదా.. అందువల్ల తన భర్త కోసం అనసూయ ఇలా అప్పుడప్పుడు వ్రతాలు కూడా చేస్తోంది.

ఈ వట సావిత్రి పూజ చేసినట్టు సోషియల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ తెలిపింది. సాంప్రదాయ దుస్తుల్లో అనసూయ పూజ చేస్తూ ఉన్న ఫోటోలను చూసిన నెటిజన్లు నువ్వు కూడా భర్త కోసం ఇలా పూజలు చేస్తావా? అంటూవివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే సాధారణంగా పౌర్ణమి నాడు ఈ వట సావిత్రి పూజ చేస్తారు. అంటే జూన్ 14 వ తేదీన ఈ పూజ చేస్తారు. కానీ అనసూయా మాత్రం ఇప్పుడే చేసిందెంటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అనసూయ వ్రతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.