Vikarabad Parigi: వీరంగం సృష్టించిన మందుబాబులు.. కుర్చీ కోసం ఏకంగా అంత పని..?

Vikarabad Parigi: సాధారణంగా మందుబాబులు తాగితే ఎంత బీభత్సం సృష్టిస్తారో మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు మందుబాబులు ఆ మత్తులో ఏం చేస్తున్నామో తెలియకుండా ఎదుటివారిపై దాడులకు దిగుతూ ఉంటారు. కొందరు అయితే ఆ మద్యం మత్తులో చంపడానికి కూడా సిద్ధ పడుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా మందుబాబులు వికారాబాద్ లోని పరిగిలో వీరంగం సృష్టించారు. సమీపంలోని వైన్ షార్ట్ పర్మిట్ రూమ్ లో నానా హంగామా చేశారు. మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఘర్షణ కు దిగారు.

ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. అంతేకాకుండా మద్యం మత్తులో ఆ ఇద్దరు యువకులు తలలు కూడా పగలు కొట్టుకున్నారు. అసలేం జరిగిందంటే.. వికారాబాద్ లోని పరిగిలో బహార్ పేట చౌరస్తాలో ఉన్న వీరభద్ర వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో శుక్రవారం సాయంత్రం మద్యం సేవించడానికి కొందరు యువకులు వచ్చారు. ఈ క్రమంలోనే కుర్చీ కోసం ఒకరితో ఒకరు గొడవకు దిగారు. ఈ క్రమంలోనే బీరు సీసాలు కర్రలతో విచక్షణారహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పర్మిట్ రూమ్ నుంచి బయటకు వచ్చి వైన్ షాప్ ముందు రోడ్డుపై వీరంగం సృష్టించారు.

ఈ సంఘటనలో ఇరు వర్గాలవారికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ గొడవ ముగిసిన తర్వాత ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఇరువర్గాలు మద్యం మత్తు దిగిన తర్వాత చేసిన తప్పును తెలుసుకుని కాంప్రమైజ్ అయ్యారు. కానీ ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డంతో పోలీసులు కూడా చేసేది ఏమీ లేక కేసు నమోదు చేశారు. ఇక పర్మిట్ రూమ్ లో సిట్టింగ్ నడుస్తుండటం ప్రస్తుతం విమర్శలకు దారి తీసింది. ఇక ఈ విషయంలో అధికారులు తీరుఫై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.