పదో తరగతికే పార్ట్ టైం జాబ్ చేసేవాడిని… షాకింగ్ కామెంట్స్ చేసిన ఆకాష్ పూరి!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా ఎంతో గుర్తింపు పొందిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన వారసుడిగా ఆకాష్ పూరి ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ పలు సినిమాలలో నటిస్తూ మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఆకాష్ పూరి హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందే ఆయన పలు సినిమాలలో బాలనటుడిగా సందడి చేశారు. ఈ విధంగా బాల నటుడిగా గుర్తింపు పొందిన ఆకాష్ పూరి అనంతరం ఆంధ్ర పోకిరి సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చారు.

ఈ విధంగా హీరోగా పలు సినిమాలలో నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆకాష్ తాజాగా చోర్ బజార్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆకాశ్ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో వృత్తిపరమైన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ తన తండ్రి డైరెక్టర్ కాక ముందు ఒక హీరోయిన్ ని చూడటానికి వెళితే తనని దారుణంగా అవమానించిన పంపించారని అయితే ప్రస్తుతం అదే హీరోయిన్ తో సినిమా చేయటం చాలా గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే నటుడు రామ్ చరణ్ తో తనకి ఎంతో మంచి అనుబంధం ఉందని,చిన్నప్పుడు రామ్ చరణ్ తనకు ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ చేసేవారు అంటూ అప్పటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక పదో తరగతి చదివే సమయంలోనే ఏదో ఎంబిబిఎస్ చదివానని ఫీలవుతూ అప్పటికే జిమ్ లో పార్ట్ టైం జాబ్ చేసేవాడిననీ ఈ సందర్భంగా ఆకాష్ తన వృత్తి పరమైన వ్యక్తిగత జీవితం గురించి తెలియజేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.